Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.ఎం.క్రియేషన్స్ పతాకంపై ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం 'సత్యమేవ జయతే-1948'. మహాత్మా గాంధీ హత్య ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆలేఖ్య, రఘునందన్ (గాంధీ), ఆర్యవర్థన్ రాజు (గాడ్సే), నాగినీడు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్), జెన్సీ (మహ్మాద్ అలీ జిన్నా), సమ్మెట గాందీ ó(అబ్దుల్ గఫార్ ఖాన్), ఇంతియాజ్ (నెహ్రూ), శరద్ దద్భావాలా (సర్దార్ వల్లభాయి పటేల్), పి.శ్రీనివాస్ (అబుల్ కలాం అజాద్) తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శరద్ దద్భావాలా క్లాప్ నివ్వగా, పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ, 'మహాత్మాగాంధీ హత్య గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. వివాదాలకు ఆస్కారం లేకుండా మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం' అని అన్నారు.
'11372 పేజీల రీసెర్చ్ పేపర్స్. 350కిపైగా పుస్తకాలు, 750కిపైగా ఇంటర్వ్యూలు పరిశోధించి, 96 పాత్రలు, 114 సీన్స్, 500లకిపైగా ప్రాపర్టీస్, 370కిపైగా కాస్ట్యూమ్స్, 500 మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లోకేషన్లలో, 9 షెడ్యూల్స్లో ప్రస్తుతం ఉన్న సాంకేతిక ప్రమాణాలతో జాతీయ, అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమాని రూపొందించనున్నాం' అని నటుడు డా||ఆర్యవర్ధన్ రాజు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గులాబీ శశీ ప్రీతమ్. కెమెరా, కథ, స్క్రీన్ప్లే, మాటలు: డా|| ఆర్యవర్థన్రాజు.