Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అజరుదేవగన్ తండ్రి, సీనియర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని సూర్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. 'దిల్వాలే', 'హిమ్మత్వాలా', 'షెహన్షా', 'లాల్ బాద్షా', 'ఇష్క్', 'మిస్టర్ నటర్వ్లాల్', 'క్రాంతి', 'ఫూల్ ఔర్ కాంటే' వంటి అనేక సినిమాలకు వీరూ దేవగన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. అంతేకాదు 1999లో అమితాబ్ బచ్చన్, అజరుదేవగన్, మనీషా కొయిరాలా, సుస్మితాసేన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన 'హిందుస్థాన్ కీ కసమ్' చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. అలాగే పలు చిత్రాల్లో ఆయన నటించారు. యాక్షన్ కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా వీరూ దేవగన్ బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.