Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సాహో' నుంచి వైదొలగినట్టు సంగీత దర్శకులు శంకర్- ఎహలాన్-లారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'సాహో'కు సంగీతం సమకూర్చడం నుంచి శంకర్ -ఎహలాన్ - లారు తప్పుకున్నారని అభిమానులకు తెలియజేస్తున్నాం. ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యామ్కి గుడ్లక్' అని దర్శక త్రయం ట్వీట్ చేసింది. అయితే వీరు వైదొలగటానికి కారణం ఏంటనేది వెల్లడించలేదు. కాగా, వీరి స్థానంలో తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ను తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.