Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 'డబుల్ దిమాక్' అనేది ట్యాగ్లైన్. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్కి అద్భుతమైన స్పందన లభించింది. టైటిల్ రోల్లో రామ్ టెర్రిఫిక్గా నటించాడని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాటలను హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో చిత్రీకరించనున్నారు. అన్ని పనులు పూర్తి చేసి జులై 12న సినిమాని విడుదల చేయనున్నాం. పూరీ మార్క్ సినిమా ఇది' అని తెలిపింది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: రాజ్ తోట,
ఆర్ట్: జానీ షేక్, ఎడిటర్: జునైద్ సిద్ధికీ.