Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవిశేషు, శివానీ రాజశేఖర్ జంటగా లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై నూతన దర్శకుడు వెంకట్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా '2 స్టేట్స్'. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన '2 స్టేట్స్' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మాత. దాదాపు 70 శాతం షూటింగ్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ మధ్యంతరంగా ఆగిపోయింది.
ఈ విషయమై దర్శకుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, 'నేను ముంబైలోని బాలాజీ టెలీ ఫిలిమ్స్లో డైరెక్షన్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేశాను. ఈ 'స్టేట్స్' చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాను. ఈ సినిమాని ప్రారంభించే ముందే హీరో, హీరోయిన్, నిర్మాతలకు నేను ప్రిపేర్ చేసిన స్టోరీని పూర్తిగా వినిపించి, అందరి అనుమతి తీసుకున్న తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు చేసిన షూటింగ్తో 70శాతం పూర్తయ్యింది. ఈ అవుట్ఫుట్ కూడా చాలా బాగా వచ్చిందని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా మా నిర్మాత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. సినిమా బాగా వస్తున్న టైమ్లో ఈ చిత్రకథలో మార్పులు చేయమని నన్ను నిర్మాత అడిగితే తిరస్కరించాను. అంతేకాదు ఆయన కొంతమంది మాటలు విని ఈ మార్పులు చేయమంటున్నారని గ్రహించాను. నన్ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగానే కథలో మార్పులనే ఇష్యూని రైజ్ చేశారని కూడా అర్థమైంది. అంతేకాదు నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి నన్ను ప్రాజెక్ట్ నుంచి తొలగించేందుకు కూడా పలు చర్యలు చేపట్టారు. ఇదంతా చూసిన తర్వాత నేను నా నిర్మాతపై కోర్టులో కేసుని ఫైల్ చేశాను. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణని కోరింది. ఈ చిత్రానికి నేను కేవలం దర్శకుడిని మాత్రమే కాదు. నేనొక పార్టనర్ని కూడా. అలాగే ప్రాఫిట్ హోల్డర్ని. ఈ చిత్ర హక్కులతోపాటు రీమేక్ రైట్స్, ఈ సినిమాకి దర్శకత్వం వహించే హక్కులు కూడా నాకు మాత్రమే ఉన్నాయి. నేను కాకుండా ఎవరైనా ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన 30 శాతాన్ని షూటింగ్ చేసేందుకు వచ్చే దర్శకుడిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాను' అని చెప్పారు.