Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, మెహరీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం విదితమే. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఛలో' లాంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని నిజాయితీగా నిర్మించాం. అంతే నిజాయితీగా ఆడియెన్స్ అఖండ విజయం అందించారు. మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాలను ఆడియెన్స్ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తాం. 'ఛలో' మంచి ప్రేమకథ, 'నర్తనశాల' మంచి కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. నాగశౌర్య రాసిన కథకి దర్శకుడు రమణ తేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ని చాలా అందంగా, అర్థవంతంగా షూట్ చేస్తున్నాడు.
మెహరీన్ హీరోయిన్గా మరోసారి ప్రేక్షకుల అభిమానాన్ని కచ్చితంగా పొందుతుంది. తదుపరి షెడ్యూల్ని జూన్లో ప్లాన్ చేస్తాం. ఆద్యంతం మంచి వినోదాత్మకంగా సినిమా రూపొందుతుంది' అని అన్నారు. చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెదటి షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా రావటం, దర్శకుడి కమిట్మెంట్ యూనిట్లో అందరికి ఆనందాన్ని కలిగించింది. చిత్ర సమర్పకుడు శంకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి అన్నీ దగ్గరుండి యూనిట్ని ఓ ఫ్యామిలీలా చూసుకుంటున్నారు. నిర్మాత ఉషాముల్పూరి ఎక్కడా రాజీ పడకుండా దర్శకుడి విజన్కి తగ్గట్టుగా సినిమాని రిచ్గా ఉండేలా చూస్తున్నారు' అని తెలిపింది.