Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంగళవారం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 'నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్న(ఎన్టీఆర్)గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా. జయహో ఎన్టీఆర్' అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో 'ముగ్గురు దర్శకులతో, ముగ్గురు హీరోయిన్స్తో దర్శకేంద్రుడి సినిమా! హీరో ??' అని ఉంది. ఈ సినిమాకి కె.రాఘవేంద్రరావుతోపాటు మరో ఇద్దరు యువ దర్శకులు డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. మరి హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కె.రాఘవేంద్రరావు చివరగా 2017లో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని రూపొందించారు. నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా పరాజయం చెందింది. ఈ క్రమంలో రాఘవేంద్రరావు తన పూర్వ వైభవాన్ని పొందేందుకు చేసే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.