Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా జీవితంపై బయోపిక్ రూపొందుతుందనే వార్తల్లో వాస్తవం లేదు. దయజేసి ఎవరూ బయోపిక్ తీయొద్దు' అని అంటున్నారు మాధురీ దీక్షిత్. అలనాటి అందాల తారగా, అంతకి మించిన అత్యద్భుత నటిగా భారతీయ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన మాధురీ దీక్షిత్పై బయోపిక్ రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, 'పుకార్లలో నేను విన్న ఉత్తమమైన పుకార్లు ఇవే. రూమర్స్ని నమ్మకండి. ఒకవేళ ఎవరైనా బయోపిక్ తీయాలనుకుంటే ఆ ఆలోచన విరమించుకోండి. నాకిష్టం లేదు. ఎందుకంటే నా జీవితంలో నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది' అని తెలిపారు. 'కళంక్' పరాజయంపై స్పందిస్తూ, 'హిట్, ఫ్లాప్ మన చేతుల్లో ఉండదు. ఆర్టిస్టుగా మేం బెస్ట్ ఇస్తాం. నా కెరీర్లో ఇలాంటివి చాలా చూశాం' అని అన్నారు.