Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా హీరోహీరోయిన్లుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'బుర్రకథ'. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదల హక్కులను వింటేజ్ క్రియేషన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'రెండు మెదళ్ళతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్తో రూపొందిస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్కి అత్యద్భుతమైన స్పందన లభిస్తుంది. ఈ స్పందన వల్లే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ని వింటేజ్ క్రియేషన్స్ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్లో సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల బిజినెస్ హక్కులు, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయి. ఫన్ రైడింగ్ చిత్రమిది. కచ్చితంగా అన్ని వర్గాలకి మంచి వినోదాన్ని పంచుతుంది' అని తెలిపింది. రాజేంద్రప్రసాద్, పోసాని, పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, గీతా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరామెన్: సి.రాంప్రసాద్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్: చిన్నా.