Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓటర్'. జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాత జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ, 'రాజకీయ ప్రధానంగా సాగే చిత్రమిది. ఓటు, ఓటర్ విలువ చెప్పే చిత్రం. చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచే సినిమా అవుతుంది. ఇందులో విష్ణు దేశాన్ని ప్రేమించే వ్యక్తి. ప్రజాస్వామ్యం ఓటర్ వల్లే నిర్మించబడిందని నమ్మే వ్యక్తి. ఆయన ఓటర్లో తెచ్చే మార్పేంటి అనేది సినిమాలో ఆసక్తికరం. కథ, కథనాలు ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్ని పొందింది. దర్శకుడు కార్తీక్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. జూన్లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ సినిమాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం' అని అన్నారు.