Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను మైనర్ కథానాయి కలతో సినిమాలు చేయడం లేదు' అని అంటున్నారు సల్మాన్ ఖాన్. ఆయన ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో 'భారత్' చిత్రం లో నటించారు. కత్రినా కైఫ్, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా రంజాన్ కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ప్రెస్మీట్లో దిశాపటానీ మాట్లాడుతూ, 'భవిష్యత్లో నేను సల్మాన్తో కలిసి పనిచేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు, నాకు వయసు రీత్యా చాలా వ్యత్యాసం ఉంది' అని తెలిపింది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ఓ ప్రెస్మీట్లో సల్మాన్ వద్ద ప్రస్తావించగా ఆయన మండిపడ్డారు. 'భవిష్యత్లో దిశా నాతో కలిసి పనిచేయదా? ఎందుకలా? ఎవరి వయసు గురించి ఆమె అలా మాట్లాడుతుంది. నేను మైనర్లతో సినిమాలు చేస్తున్నానా?' అని మండిపడ్డారు. మరోవైపు దక్షిణాది సినిమాల్లో 'బాహుబలి'ని చూశారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సల్మాన్ స్పందిస్తూ, 'నేను 'బాహుబలి: ది బిగినింగ్' మాత్రమే చూశా. రెండో పార్ట్ చూడలేదు. అందుకే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు తెలియదు' అని సెటైర్ వేశారు. ప్రస్తుతం సల్మాన్ 'దబాంగ్3' చిత్రంలో నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తుంది. ఇది ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.