Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'దొరసాని'. ఈ చిత్ర ఫస్ట్లుక్ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'రియలిస్టిక్ కథాంశాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి ఓ సహజత్వమైన కథతో వస్తోన్న చిత్రమిది. టైటిల్కి తగ్గట్టుగానే ఇది తెలంగాణలోని ఓ ప్రాంతంలో 1980లో జరిగిన కథతో తెరకెక్కుతుంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర ప్రీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా విడుదలైన ఫస్ట్లుక్ ఆ ఇంట్రెస్ట్ని మరింతగా పెంచింది. ఇందులో రాజు, దొరసాని చూడ ముచ్చటగా ఉన్నారు. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్పై వచ్చిన హీరో ఆరాధనగా చూస్తున్నట్టుగా ఉన్న ఫస్ట్లుక్ కథలోని ఆత్మని తెలియజేస్తుంది. అదే సందర్భంలో రాజు కళ్ళల్లో ప్రేమ, దొరసాని కళ్ళల్లో దర్పం ఈ చిత్ర ప్రేమ కథలో వైరుధ్యాన్ని చూపిస్తున్నాయి. ఫస్ట్లుక్ చూస్తుంటే సినిమా ఆనాటి కాలాన్ని ప్రతిబింబిస్తుందని అర్థమవుతుంది. ఈ సినిమా ద్వారా కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ని జూన్ 6న విడుదల చేయనున్నాం' అని తెలిపింది.