Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భవిష్యత్లో రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్లతో కలిసి పనిచేయాలనుంది. అందుకోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా' అని అంటోంది కత్రినా కైఫ్. ప్రస్తుతం బాలీవుడ్లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కత్రినా దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. అమీర్ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షరు కుమార్, హృతిక్ రోషన్, రణ్బీర్ కపూర్ వంటి వారి సరసన నటించి మెప్పించింది. బాలీవుడ్ ఆడియెన్స్ని ఫిదా చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అయితే కత్రినాకు రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్లతో కలిసి పనిచేయాలనే కోరిక ఉందట. ఈ విశేషాలను ఇటీవల 'భారత్' చిత్ర ప్రమోషన్లో భాగంగా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ, 'రణ్వీర్ సింగ్, టైగర్ చూడ్డానికి చాలా బాగుంటారు. వారితో వర్క్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. రణ్వీర్తో క్రేజీ, ఫన్నీ సినిమా, టైగర్లో యాక్షన్ సినిమా చేయాలనుంది. త్వరలో ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా' అని తెలిపింది. ప్రేమలో బ్రేకప్ గురించి స్పందిస్తూ, 'బ్రేకప్ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కెరీర్ పరంగా, వ్యక్తంగానూ చాలా మారాను. నాకోసం నేను జీవిస్తున్నా. ఏదైనా ఓ విషయంలో స్ట్రక్ అయితే మనం చాలా డిస్ట్రర్బ్ అవుతాం' అని తెలిపింది.