Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన దేశంలో ఒకరి పట్ల లింగ వివక్ష, జాతి వివక్ష, కుల, మత విభేదాలు చూపించకూడదు. ఆ విషయంలో ఇకపై మార్పుని తెద్దాం' అని అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్టికల్ 15'. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్ని ఇటీవల విడుదల చేశారు. 'మన దేశంలో ఒకరి పట్ల లింగ వివక్ష, జాతి వివక్ష, కుల, మత విభేదాలు చూపించకూడదు. ఇది నేను చెప్పడం కాదు, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 చెబుతోంది. ఈ విషయంలో మనం ఇప్పటి వరకు విభేదించాం. ఇకపై మార్పుని తెద్దాం' అని టీజర్లో ఆయుష్మాన్ ఖురానా చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు రాజకీయ పార్టీలు, ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం వంటివి టీజర్లో హైలైట్గా నిలిచాయి. దేశంలో జరిగిన యదార్థ షాకింగ్ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇషా తల్వార్, సయాని గుప్తా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ని ఈ నెల 30న, సినిమాని జూన్ 28న విడుదల చేయనున్నారు.