Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జీరో' చిత్ర పరాజయంతో షారూఖ్ఖాన్ పూర్తిగా నిరాశ చెందారు. తదుపరి ప్రాజెక్ట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు ఇప్పటికే వ్యోమగామి రాకేష్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకున్నారు. 'జీరో' విడుదలై ఆర్నేళ్ళకుపైనే అవుతున్నా ఇంకా నెక్ట్స్ ప్రాజెక్ట్ని ప్రకటించలేదు. తాజాగా ఆయన ఫరాఖాన్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట.
గతంలో వీరి కాంబి నేషన్లో 'మై హూన్ నా', 'హ్యపీ న్యూ ఇయర్' చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ ఘన విజయాలు అందుకున్నాయి. మూడోసారి తన హిట్ కాంబినేషన్ని రిపీట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఫరా ఖాన్ దర్శకత్వంలో ఓ రీమేక్ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. గతంలో అమితాబ్ బచ్చన్, హేమామాలిని జంటగా నటించిన సూపర్ హిట్ 'సత్తే పే సత్తా' చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నారట. దాదాపు ఈ రీమేక్ కన్ఫమ్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో కత్రినా కైఫ్ని ఎంపిక చేసే ఆలోచనలో దర్శకురాలు ఉన్నారట. 'సత్తే పే సత్తా' 1982లో వచ్చిన యాక్షన్ కామెడీ. రాజ్ ఎన్.సిప్పీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.