Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరినాథ్ పొలిచెర్ల హీరోగా నటిస్తూ డ్రీమ్ టీమ్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కెప్టెన్ రాణా ప్రతాప్'. 'ఏ జవాన్ స్టోరీ' అనేది ట్యాగ్లైన్. ఈ చిత్ర ఫస్ట్లుక్ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఇందులో దర్శక, నిర్మాత హరినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో మిలిటరీ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న చిత్రమిది. హరినాథ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. జవాన్ గెటప్లోని ఆయన ఫస్ట్లుక్ ఆకట్టుకుంటుంది. చిత్ర షూటింగ్ పూర్తయ్యింది.
మూడు షెడ్యూల్స్లో పూర్తి చేశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి' అని తెలిపింది. సుమన్, పునీత్ ఇస్సార్, షయాజీ షిండే, అమిత్, జ్యోతిరెడ్డి, నిషి, గిరి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్, షకీల్, కెమెరా: వంశీ ప్రకాష్, ఎడిటర్: వెంకట రమణ, ఆర్ట్: గోవింద్.