Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. సైనా పాత్రని సవాల్గా తీసుకుని నటిస్తున్నా' అని అంటోంది పరిణీతి చోప్రా. బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఏకధాటిగా జరుగుతోంది. సైనా పాత్ర కోసం పరిణీతి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, 'బాడ్మింటన్ మాస్టర్ గేమ్. ఇందులో సైనా బాడీలాంగ్వేజ్ని పట్టుకోవడం కష్టమైన పని. అందుకోసం ఎంతో శ్రమించాను. అయితే ఎట్టకేలకు సైనా బాడీ లాంగ్వేజ్ని పట్టుకోగలిగాను. కానీ సైనాలా ఫిట్నెస్ సాధించడం సవాల్గా మారింది. శిక్షణ తీసుకోవడం, ఆడటం పెద్ద ఛాలెంజింగ్ పార్ట్. సైనా నన్ను ప్రతి అంశంలోనూ ట్రైన్ చేసింది. తెరపై ఆ కష్టం కనిపిస్తుంది. సైనా పాత్రకి న్యాయం చేస్తానని నమ్ముతున్నా' అని తెలిపింది. ప్రస్తుతం 'జబారియా జోడీ' చిత్రంలోనూ పరిణీతి నటించింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకి జోడీగా పరిణీతి మెరవబోతున్నారు. ఇది ఈ నెల 12న విడుదల కానుంది. దీంతోపాటు 'సందీప్ ఔర్ పింకీ ఫరార్', 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రాల్లోనూ పరిణీతి నటిస్తోంది.