Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్లోని పుల్వామా సమీపంలో తీవ్రవాదుల దాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవానులు కన్నుమూసిన విషయం విదితమే. వీరికి ప్రత్యేకంగా నివాళ్ళర్పించాలని బాలీవుడ్ ప్రముఖులు నిర్ణయించారు. అందుకోసం ఓ ప్రత్యేక వీడియో సాంగ్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఐశ్వర్యరారు నటిస్తుంది. ఆమెతోపాటు అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్ వంటి దాదాపు 14 మంది బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించనున్నారట. నాలుగు నిమిషాల నిడివితో ఈ వీడియో సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. దీనికి 'తు దేశ్ మేరా' అనే టైటిల్ పెట్టారు. చాలా మంది తారలపై ఇప్పటికే చిత్రీకరణ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఇటీవలే ఐశ్వర్య కూడా పాల్గొన్నారట. అభిషేక్ మిశ్రా, ఎమ్డీ, హ్యాపీ ప్రొడక్షన్స్ ఇండియా దీన్ని నిర్మిస్తున్నారు. వీరికి ఐష్ అన్ని రకాలుగా సపోర్ట్ని అందిస్తున్నారట. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేశారు. 'మేజర్ బాలీవుడ్ స్టార్స్తో ఈ వీడియో రూపొందిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఐశ్వర్యరారు చాలా సహకరిస్తున్నారు. ఆమెపై చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ పాటతో పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన సైనికులకు ఘన నివాళి అందించనున్నాం' అని తెలిపారు. ఇదిలా ఉంటే ఐశ్వర్య ఇటీవల మణిరత్నం సినిమాకి గ్రీన్ సిగల్ ఇచ్చిన విషయం విదితమే. పీరియాడికల్ డ్రామాగా రూపొందే ఈ చిత్రానికి 'పొన్నియిన్ సెల్వన్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. భారీ మల్టీస్టారర్గా రూపొందే ఈ చిత్రంలో ఐశ్వర్యతోపాటు అమితాబ్ బచ్చన్, విక్రమ్, జయంరవి, మోహన్బాబు, కార్తీ, కీర్తిసురేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.