Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మహర్షి' విజయంతో ఆడియెన్స్ మాకిచ్చిన రెస్పెక్ట్ జీవితాంతం గుర్తుండి పోతుంది. ఈ సినిమా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. రైతులను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే' అని అంటున్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. మహేష్బాబు, పూజా హెగ్డే జంటగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మహర్షి'.
గత నెలలో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు వంశీపైడిపల్లి మాట్లాడుతూ, 'ఈ సినిమా నా కెరీర్లో చూడనంత పెద్ద బ్లాక్ బస్టర్తోపాటు మహేష్బాబు కెరీర్లోనే ల్యాండ్ మార్క్ నిలవడం సంతోషంగా ఉంది. ఏ నమ్మకంతో సినిమాని ప్రారంభించామో, ఆ నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిజం చేశారు. ఎక్కడికెళ్ళినా రైతులు తమ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మాకు ఒక గుర్తింపునిచ్చారన్నా అంటున్నారు. మాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. సొసైటీలో ఇది ఇంత ప్రభావాన్ని చూపించి, ఇంతమందిని ఇన్స్పైర్ చేసే సినిమా అయినందుకు మా టీమ్ అందరికీ థ్యాంక్స్. సినిమాని అభినందించిన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఇండిస్టీ ప్రముఖులకు మా టీమ్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా జీవితంలో తీపి గుర్తుగా మిగిలిపోయే చిత్రమిది. ఈ సినిమా చూసి సూర్య మెమొరబుల్ కాంప్లిమెంట్ ఇచ్చారు. 'మనం దాదాపు 20, 25 ఏండ్ల వరకు సొసైటీ నేర్పిందో లేదా ఒక స్కూల్ నేర్పిందో, పేరెంట్స్ నేర్పిందో పట్టుకొని వెళ్తుంటాం. కానీ మీ సినిమా ద్వారా 20, 25 సంవత్సరాల్లో నేర్చుకోని ఒక థాట్ని ప్రొవోక్ చేశారు. మీరు రాసిన కథ, మహేష్గారు చూపించిన గట్స్, సోషల్ మెసేజ్ అమేజింగ్' అన్నారు. ఆయనకు థ్యాంక్స్. త్వరలోనే నెక్ట్స్ సినిమా వివరాలు వెల్లడిస్తాను' అని అన్నారు.
'మా సినిమా మూడోవారం పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా నాలుగోవారంలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ దాటి సూపర్ కలెక్షన్స్తో కొనసాగుతుంది. ఒక సినిమా విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడు ఆ సినిమా విజయవంతమైతే వచ్చే కిక్కే వేరు. అదే 'మహర్షి' నిరూపించింది. కొన్ని సినిమాలు డబ్బుతోపాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతికి 'ఎఫ్2'తో పెద్ద హిట్ కొట్టాం. ఇప్పుడు సమ్మర్లో 'మహర్షి'తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాం. ఈ రెండు సక్సెస్లు ఇచ్చిన కిక్తో ఇంకో మూడు ప్రొడక్షన్స్తో రాబోతున్నాం. త్వరలోనే మళ్ళీ వంశీతో మరో సూపర్హిట్కి రెడీ అవుతున్నాం. సబ్జెక్ట్ రెడీ అయ్యింది' అని నిర్మాత దిల్రాజు చెప్పారు.