Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్య్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కొలైగారన్'. అషిమా కథానాయికగా నటించింది. దియా మూవీస్ బ్యానర్లో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్పై టి.నరేష్కుమార్, టి.శ్రీధర్ కలిసి తెలుగులో 'కిల్లర్' పేరుతో విడుదల చేస్తున్నారు.
విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'థ్రిల్లర్ ప్రధానంగా సాగే చిత్రమిది. విజరు ఆంటోనీ, అర్జున్ కాంబినేషన్లో రాబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తెలుగులో బిజినెస్ బాగా జరిగింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారు కోరుకునే థ్రిల్లర్ అంశాలన్ని ఇందులో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్ పొందింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి రంజాన్ కానుకగా ఈ నెల 7న గ్రాండ్గా విడుదల చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సైమన్.కె.కింగ్, కెమెరా: మాక్స్.