Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత ప్రధాన పాత్రలో నాగశౌర్య, లక్ష్మి, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారులుగా బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యూన్ హు, థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'ఓ బేబీ.. ' అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. దీనికి మంచి శ్రోతకాదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'కుటుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గడపాలనే విషయాన్ని ఆలోచింపజేసే కోణంలో రూపొందుతున్న చిత్రమిది. దర్శకురాలు నందినిరెడ్డి చాలా బాగా తెరకెక్కించారు. అన్ని అంశాలను మేళవించి అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడర్గా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్, టీజర్కి ప్రేక్షకుల నుంచి అత్యద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదలైన పాట సైతం అందరినీ విశేషంగా అలరిస్తోంది. మిక్కీ జే మేయర్ వినసొంపైన బాణీలను అందించారు. ఇందులో ఎక్కువమంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులుగా మహిళలే పనిచేయడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జులై 5న విడుదల చేయనున్నాం' అని తెలిపింది. తేజ సజ్జ, ప్రగతి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ.