Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గత మూడేండ్లుగా నా మైథలాజికల్ చిత్రం 'హిరణ్యకశ్యప'పై వర్క్ చేస్తున్నా. త్వరలోనే సినిమాని తెరపైకి తీసుకొస్తాం' అని అంటున్నారు దర్శకుడు గుణశేఖర్. 'రుద్రమదేవి' తర్వాత ఆయన మరే సినిమా చేయలేదు. అప్పట్నుంచి ఆయన 'హిరణ్యకశ్యప' స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నారు. ఇందులో రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు భారీ ప్రణాళికలు చేస్తున్నారు. ఆ విశేషాల గురించి గుణశేఖర్ మాట్లాడుతూ,' 'హిరణ్యకశ్యప' చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మూడేళ్లుగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి టైటిల్ రోల్ పోషిస్తారు. ఈ సినిమాకి చేస్తున్న వర్క్ ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడుతుంది'అని అన్నారు. 'గుణ శేఖర్ సినిమాలంటే గ్రాండియర్ మేకింగ్కి కేరాఫ్. భారీ బడ్జెట్ చిత్రాలను, గ్రాఫిక్స్, కళ్లు చెదిరే సెట్స్తో సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు. ఆయన దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే భారీ బడ్జెట్ మైథలాజికల్ తెరకెక్కనుంది. ప్రహ్లాదుడు తండ్రి అయిన రాక్షసరాజే ఈ హిరణ్య కశ్యప. విష్ణుమూర్తి ద్వేషి అయిన ఈ రాక్షసరాజు సంహారం కోసమే మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తారు. అదే ఈ కథ' అని చిత్ర వర్గాలు తెలిపాయి.