Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ హవీష్ లక్ష్మణ్ కోనేరు పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'రాక్షసుడు'. ఈ చిత్ర టీజర్ని శనివారం విడుదల చేశారు. 'దిస్ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ యాంటీ సోషల్ డిజార్డర్', 'సింపుల్గా చెప్పాలంటే వాడొక సైకో, వాడికి నొప్పంటే ఏంటో తెలియదనుకుంటా, రాక్షసుడు' అంటూ సాగే టీజర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్లో సీనియర్ నటుడు సూర్య, చిన్న పాప కనిపిస్తున్నారు. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను క్రూరంగా హింసించి చంపే ఓ సైకోకి, పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గేమ్ ఇది అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత హవీష్ కోనేరు మాట్లాడుతూ, ' తమిళంలో విజయవంతమైన 'రాక్షసన్' చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మేకింగ్లో రాజీపడకుండా నిర్మించాం. రమేష్ వర్మ చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్గా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూలై 18న విడుదల చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్.