Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివిశేష్, రెజీనా కసండ్ర జంటగా, నవీన్ చంద్ర కీలక పాత్రలో వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా ఓ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా దీనికి 'ఎవరు' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా సోమవారం చిత్ర పోస్టర్ని విడుదల చేశారు. 'అడివిశేషు, పీవీపీ సినిమాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'క్షణం' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా పెద్ద హిట్టై టాక్ ఆఫ్ ది ఇండిస్టీ అయ్యింది. అంతేకాదు విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో 'ఎవరు' పేరుతో మరో సినిమా రావడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ ప్రధానంగా సాగే చిత్రమిది. ఈద్ పండుగని పురస్కరించుకుని ఈ చిత్ర పోస్టర్ని విడుదల చేశాం. వెంకట్ రామ్జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది. ఆగస్ట్ 23న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.