Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ 'రాంఝానా' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. 2013లో విడుదలైన ఈ సినిమాకి ఆనంద్.ఎల్.రారు దర్శకుడు. సోనమ్ కపూర్ కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం దాదాపు రూ.140కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. తాజాగా 'రాంఝానా' కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ధనుష్ హీరోగా రారు ఓ సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అటు రారు, ఇటు ధనుష్ స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ధనుష్ నటిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్టార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' ట్రైలర్ విడుదల సందర్భంగా మంగళవారం తెలిపారు. అడ్వెంచరస్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్తోపాటు హాలీవుడ్ నటులు నటించారు. ఇండియాలో ఇప్పటికే విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు. ఈ నెల 21న సినిమాని హాలీవుడ్లో రిలీజ్ చేయబోతున్నారు.