Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భారత్' సినిమాని ప్రేక్షకులకు చూపించాలని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నా. అందుకోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నా' అని అంటోంది కత్రినా కైఫ్. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కత్రినా నటించింది. దిశా పటానీ కీలక పాత్ర పోషించింది. ఇందులో సల్మాన్, కత్రినా కైఫ్ ఐదు విభిన్న గెటప్లో కనిపించనున్నారు. యుక్త వయసు నుంచి 70ఏండ్ల వరకు భారత్ అనే వ్యక్తి చేసే జర్నీ ప్రధానంగా రూపొందిన దేశభక్తి చిత్రమిది. భారత్ పాత్రలో సల్మాన్ నటించారు. ఈ సినిమా రంజాన్ సందర్భంగా నేడు(బుధవారం) విడుదల కానుంది. అయితే సినిమాని ఎప్పుడెప్పుడు ఆడియెన్స్కి చూపించాలా? అని కత్రినా వెయిట్ చేస్తున్నారట. చిత్ర ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. సినిమాని ఆడియెన్స్ తొందరగా చూస్తే బాగుండూ అనిపిస్తుంది. వారి స్పందన తెలుసుకోవాలని ఉంది. సినిమా విషయంలో మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇది బాక్సాఫీసు వద్ద ఎంతటి కలెక్షన్లని రాబడుతుందనేది చెప్పలేం కానీ, ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ కచ్చితంగా దక్కుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. ప్రస్తుతం అక్షరుకుమార్తో కలిసి రోహిత్ శెట్టి 'సూర్యవంశీ'లో కత్రినా నటిస్తోంది.