Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందు, రష్మి గౌతమ్, నందినీ రాయ్ ప్రధాన పాత్రధారులుగా నాగ ప్రభాకరన్ దర్శకత్వంలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఏ. పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శివరంజని'. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'పాప్ కార్న్' అంటూ సాగే స్పెషల్ సాంగ్ని మంగళవారం దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇంతకు ముందే ఈ చిత్ర ట్రైలర్ చూశా. చాలా బాగుంది. హర్రర్ బ్యాక్ డ్రాప్లో చాలా రిచ్గా తీసిన చిత్రమిది. 'పాప్ కార్న్' పాట కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. నిర్మాత పద్మనాభరెడ్డికి ఈ సినిమా మంచి పేరుతోపాటు లాభాల్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'హర్రర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా కనిపించే చిత్రమిది. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంది. రష్మి క్యారెక్టర్లోని వేరియేషన్స్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తే, ఊహించని కథ, కథనాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకొని సెన్సార్ కి రెడీగా ఉంది' అని చిత్ర దర్శకుడు తెలిపారు. నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ, 'దర్శకులు మారుతి చేతులు మీదుగా మా సినిమా స్పెషల్ సాంగ్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. హర్రర్ సినిమాలలో ఇది విభిన్నంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది. జులైలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. అఖిల్ కార్తీక్, ధన్రాజ్, ఢిల్లీ రాజేశ్వరీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేందర్రెడ్డి.