Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవీష్, రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, పూజిత పొన్నాడ, అనిషా ఆంబ్రోస్, అదితి ఆర్య హీరోహీరోయిన్లు నిజార్ షఫీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సెవెన్'. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ, 'సినిమా నచ్చి వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ తీసుకున్నాం. రొమాంటిక్ థ్రిల్లర్గా, చాలా కొత్త కాన్సెప్ట్తో
రూపొందిన చిత్రమిది. హవీష్ చాలా బాగా నటించారు. సినిమా బాగా వచ్చింది. నేడు(బుధవారం) రాత్రి 7.30 నుంచి అన్ని మల్టీప్లెక్స్ల్లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నాం. గురువారం నుంచి సినిమాని అన్ని థియేటర్స్లో రెగ్యులర్గా విడుదల చేస్తున్నాం' అని అన్నారు. 'రెండేండ్ల జర్నీ ఇది.
కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, టీజర్ చూశాక కూడా అదే ఎగ్జైట్మెంట్ కనిపించింది. రమేష్ వర్మ మంచి కథ అందించారు. సినిమా విజయం సాధిస్తే మొదటి క్రెడిట్ ఆయనకే వెళ్తుంది. నిజార్ షఫీ కెమెరా వర్క్ నాకిష్టం. రమేష్ వర్మ ఈ కథ చెప్పినప్పుడే ఈ కథని నిజార్ అయితే బాగా చూపిస్తాడని చెప్పా. ఆయన మొదట నో చెప్పినప్పటికీ, కథ విన్నాక, ఇలాంటి స్టోరీ మళ్లీ వస్తుందో, రాదో అని దర్శకత్వం వహించేందుకు ముందుకు వచ్చారు. రొమాంటిక్గా, గ్లామరస్గా అత్యద్భుతంగా తెరకెక్కించారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. హీరోయిన్లు బాగా నటించారు. చైతన్య భరద్వాజ్ మంచి బాణీలు అందించారు. సినిమాని పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నా' అని హీరో హవీష్ తెలిపారు. హీరోయిన్ నందితా శ్వేత చెబుతూ, 'ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇందులో ఎలాంటిఒత్తిడి లేకుండా
చాలా కాజువల్గా నటించాను. రమ్య పాత్రకి న్యాయం చేస్తానని నమ్మిన రమేష్ వర్మకి థ్యాంక్స్. ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ చిత్రమవుతుంది. గ్లామర్కి స్కోప్ ఉంది. దీంతో ఎక్కడా బోర్ కొట్టదు' అని చెప్పారు. పూజిత పొన్నాడ,
త్రిధా చౌదరి తదితరులు ఈ ప్రెస్మీట్లో పాల్గొని చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలిపారు.