Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా రూపొందుతుంది. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఆద్యంతం నవ్యమైన వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. రామోజిఫిల్మ్ సిటీలో మాస్మహరాజ్ రవితేజ, వెన్నెల కిషోర్ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మంగళవారం, బుధవారం వికారాబాద్లో చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ చిత్రంలో 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్, 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. అభిరుచి గల నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా, క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కి అద్భుతమైన స్పందన లభించింది' అని తెలిపింది. బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్కి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని, మ్యూజిక్ : థమన్, ఎడిటర్ : నవీన్ నూలి.