Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, మెహరీన్ జంటగా రమణతేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఓ నయా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రెండో షెడ్యూల్ని జరుపుకోబోతుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ''ఛలో' లాంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని చాలా నిజాయితీగా నిర్మించాం. అంతే నిజాయితీగా ఆడియెన్స్ అఖండ విజయం అందించారు. అన్ని వర్గాల ఆడియెన్స్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలని నిర్మిస్తున్నాం. 'ఛలో' మంచి ప్రేమకథ. 'నర్తనశాల' మంచి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే ఇది మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఈ నెల 8 నుంచి వైజాగ్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తాం. రాజీపడకుండా నిర్మిస్తున్నాం. హీరో నాగశౌర్య రాసిన కథకి దర్శకుడు రమణతేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ని చాలా అందంగా, అర్థవంతంగా తెరకెక్కిస్తున్నారు. మెహరిన్ హీరోయిన్గా ఈ చిత్రంతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది' అని అన్నారు.