Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్ర పరిశ్రమలో స్టార్స్ వారసులకు ట్రీట్మెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. సెట్లో గౌరవ మర్యాదల
విషయంలో వారిని గొప్పగా ట్రీట్ చేస్తారు. అదే ఇండిస్టీకి సంబంధం లేని వాళ్ళని చూసే విధానంలో మార్పు ఉంటుంది. కానీ కృతి సనన్కి మాత్రం అలాంటి తేడా కనిపించలేదట. స్టార్ కిడ్నైన, తననైనా సమానంగానే చూస్తున్నారట. కృతి 'హీరోపంతి' సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ప్రముఖ అగ్ర నటుడు జాకీ షరాఫ్ తనయుడు టైగర్ షరాఫ్ హీరోగా పరిచయం అయ్యారు. సెట్లో టైగర్ని, తనని దర్శక, నిర్మాతలు
ఒకేలా ట్రీట్ చేశారట. ఆ విషయాలను కృతి గుర్తు చేసుకుంది. 'నేనెప్పుడూ స్టార్ కిడ్స్తో పోల్చుకోలేదు.
బాలీవుడ్ ఎంట్రీ ఓ స్టార్ కిడ్తో జరిగింది. ఆ టైమ్లో మా ఇద్దరినీ యూనిట్ కొత్తవారిగానే,
సమానంగానే చూశారు. ఇండిస్టీకి చెందిన పిల్లలు, ఇండిస్టీ బయటి వారు అనే తేడా చూపించలేదు.
మేం అప్పటికీ నేర్చుకునే పిల్లలమే. వారు మమ్మల్ని చూసుకునే విధానంతో కంపారిజన్ అనే భావనే రాలేదు.
మనం చేసే సినిమాలు మనకు వ్యక్తిగతంగా సంతృప్తినివ్వడంతోపాటు, కమర్షియల్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అలాంటి సినిమాలు చేయాలి. అప్పుడే రెండూ బ్యాలెన్స్ అవుతాయి. పేరుతోపాటు, సక్సెస్ వస్తుంది' అని తెలిపింది. ప్రస్తుతం 'అర్జున్ పాటియాలా', 'హౌస్ఫుల్ 4', 'పానిపట్' వంటి
భారీ చిత్రాల్లో నటిస్తూ కృతి బిజీగా ఉంది.