Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం 'గేమ్ ఓవర్'. వై నాట్ స్టూడియోస్ పతాకంపై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా 1200 స్క్రిన్స్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ,'ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్కి, థియేట్రికల్ ట్రైలర్కి అనూహ్య స్పందన లభించింది. మూడు భాషల్లోని నటీనటులు, రచయితలు, దర్శకులతోపాటు చిత్ర ప్రముఖులు ట్రైలర్ని చూసి ప్రశంసలతో ట్వీట్స్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకులుగా వ్యవహరించడం విశేషంగా భావిస్తున్నాం. తాప్సీ ప్రధాన పాత్రలో ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథ, కథనాలు ఈ థ్రిల్లర్లో ఉన్నాయి. మా సంస్థ గతంలో నిర్మించిన 'లవ్ ఫెయిల్యూర్', 'గురు' చిత్రాల విజయాల సరసన ఈ చిత్రమూ నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు. 'ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త థ్రిల్ని అందిస్తుంది. ఈ చిత్రకథని దర్శకుడు తెరకెక్కించిన తీరు, ఆద్యంతం టెన్షన్ని క్రియేట్ చేసే సన్నివేశాలు, నేపథ్య సంగీతం.. ఇవన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి' అని కథానాయిక తాప్సీ చెప్పారు.