Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమాతో కంగనా రనౌత్ దర్శకురాలిగా మారిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు సగ భాగం కంగనా తెరకెక్కించారు. తాజాగా ఆమె మరోసారి దర్శకురాలిగా మెగాఫోన్ పట్టబోతున్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'మెంటల్ హై క్యా' చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారట. ఆ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి తెలిపారు. 'నేను తెరకెక్కించిన కొన్ని సన్నివేశాల విషయంలో కంగనా అసంతృప్తి వ్యక్తం చేశారు. హీరో రాజ్ కుమార్రావు పాత్ర హైలైట్ అవుతుందని భావించిన ఆమె ఆయా సన్నివేశాలని మళ్ళీ తెరకెక్కించాలన్నారు. అందుకు ఓకే చెప్పాను. కంగనా సెట్స్లో ఉంటే కేవలం నటిగానే కాదు, మిగతా విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా బాగా రావాలన్న ఉద్దేశంతోనే ఆమె వ్యవహరిస్తారు. ఈ క్రమంలో ఆమె జోక్యం తప్పుకాదు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు సైతం దర్శకులకు సూచనలు చేస్తారు. అలాంటప్పుడు కంగనా చేస్తే తప్పేంటి?' అని ఆయన అన్నారు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు కంగనా దర్శకత్వం వహిస్తారట. మరోవైపు ఆమె తమిళంలో మాజీ సీఎం, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్ 'తలైవి' సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు రూ.వంద కోట్ల బడ్జెట్తో రూపొందించబోతున్నారు. విజరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని విబ్రి మీడియా సంస్థ నిర్మిస్తుంది. దీంతో పాటు కంగనా 'పంగా' అనే మరో సినిమాలో నటిస్తుంది. దీనికి అశ్వినీ అయ్యర్ తివారి దర్శకురాలు.