Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రముఖ లెజెండరీ నిర్మాత డి.రామానాయుడు నాకు సన్నిహితులు. సినిమా రంగానికి చేసిన కృషికి అనేక అవార్డులు సాధించిన ఘనుడు. ఆయన శిలా విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయం' అని మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేడి రోశయ్య అన్నారు. మూవీ మొఘల్, నిర్మాత డి.రామానాయుడు జయంతి సందర్భంగా ఆర్.కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ డా|| రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం పలు కల్చరల్ ఈవెంట్స్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ, 'సినిమా రంగంలో ఎంతగానో కృషి చేసిన డా||రామానాయుడు జయంతిని ఇంత ఘనంగా నిర్వహించిన రంజిత్ కుమార్కి నా అభినందనలు. ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు మరిన్ని చేయాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాట్య ప్రదర్శనలు చేసిన పిల్లలను అభినందించి వారికి బాల నాట్య రత్న అవార్డులను ప్రదానం చేశారు. 'డాక్టర్ రామానాయుడు సినిమా రంగానికి చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. ఫిల్మ్ ఛాంబర్లో రామానాయుడు విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు నిర్మాతలకు పెద్దపీట వేసినట్టు అయ్యింది' అని రంజిత్ కుమార్ తెలిపారు.