Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, దిగంగన సూర్యవంశీ జంటగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హిప్పీ'. కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రం ఈ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ దిగంగన శుక్రవారం మీడియాతో ముచ్చటించింది. 'మాది ముంబయి. పలు సినిమాలు, టెలివిజన్స్ షోస్, సీరియల్స్ చేశాను. సౌత్లో నాకిది మొదటి సినిమా. నా సినిమాలు, షోస్ చూసి ఈ చిత్ర బృందం నన్ను సంప్రదించింది. ఆడిషన్ టైమ్లో ఇచ్చిన పెద్ద డైలాగ్ని విని ఇంప్రెస్ అయి ఫైనల్ చేశారు. తెలుగు కష్టంగా అనిపించింది. దీంతో వారం రోజులపాటు వర్క్షాప్కి వెళ్ళాను. స్క్రిప్ట్ చదువుకున్నాను. నా డైలాగ్స్ నేర్చుకున్నాను. మొదటి రోజు సెట్లో నేను ప్రిపేర్ అవుతుంటే కార్తికేయ బిందాస్గా కూర్చొని ఉన్నాడు. షూటింగ్లో నేను చెప్పే విధానం చూసి నెక్ట్స్ డే ఆయన ప్రిపేర్ కావడం ప్రారంభించారు.
ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం నా పాత్ర. చిత్ర కథ.
నా క్యారెక్టరైజేషన్ కొత్తగా, శక్తివంతంగా ఉంటుంది. ఇందులో నటించిన అముక్త మాల్యద పాత్ర నా రియల్ లైఫ్కి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. అయితే ఇందులో లివింగ్ రిలేషన్షిప్ ఉంటుంది.
భిన్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. ఇదేమి 'రోమియో జూలియెట్' ప్రేమ కథ కాదు. నేటి ట్రెండ్ని ప్రతిబింబిస్తుంది. నేను ఏ సినిమా చేసినా నాతోపాటు
మా పేరెంట్స్ కూర్చొని చూసేలా ఉండాలి. ఇందులో ఇంటిమేట్ సీన్స్ కథ డిమాండ్ మేరకు చేశాం.
అవి లేకపోతే సినిమా అసంపూర్తి అనే ఫీలింగ్ కలుగుతుంది. రియల్ లైఫ్లో సహజీవనం నాకిష్టం ఉండదు.
అది ప్రేమికుల ఇష్టాఇష్టాలు, పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్రేమికులు పెళ్ళికి టైమ్ పడుతుందనుకున్నప్పుడు కలిసి ఉంటే తప్పులేదు. కానీ తమ బంధాన్ని పరీక్షించుకునేలా టెస్ట్ డ్రైవ్లా ఉండకూడదు. తెలుగు సినిమాలు చూస్తుంటాను. 'బాహుబలి' ఐదారుసార్లు చూశా. అలాగే మహేష్బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు చూస్తుంటాను. కార్తికేయ నటించిన 'ఆర్ ఎక్స్ 100' కూడా చూశా. ఇప్పుడు తెలుగు నాకు హోమ్ టౌన్లాగా అనిపిస్తుంది. హిందీకి, ఇక్కడికి పెద్దగా తేడా అనిపించడం లేదు. కేవలం భాష మాత్రమే ఇబ్బంది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. పలు అవకాశాలొస్తున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు' అని దిగంగన తెలిపింది.