Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, పూజా హెగ్డే మరోసారి కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇటీవల రెండో షెడ్యూల్ని ప్రారంభించారు. టబు ఇందులో బన్నీకి తల్లి పాత్ర పోషిస్తుంది. తాజాగా ఇందులో కీలక పాత్రల కోసం హీరో సుశాంత్, హీరోయిన్ నివేతా పేతురాజ్లను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించి, వారికి శుభాకాంక్షలు తెలిపింది. శుక్రవారం నుంచి ఈ ఇద్దరూ షూటింగ్లో పాల్గొంటున్నారు. అలాగే ఈ షెడ్యూల్లో పూజా షెగ్డేపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. మరి ఇందులో సుశాంత్, నివేతా ఎలాంటి పాత్రలు పోషించబోతున్నారనేది సస్పెన్స్గా మారింది. ఇందులో నివేతా ప్రత్యేక గీతంలో కనిపించనున్నారనే మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి 'అలకనంద' అనే టైటిల్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సరికొత్త ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగని పురస్కరించుకుని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.