Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్, పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోహీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న
ఈ చిత్రం గురించి యూనిట్ తెలియజేస్తూ, 'వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. 'ముకుంద', 'కంచె', 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్2' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరోవైపు హీరో బాడీ లాంగ్వేజ్ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సినిమాని కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో దర్శకుడు హరీష్ శంకర్ దిట్ట. ఇలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపే వరుణ్ తేజ్, ఇండిస్టీ హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రంపై ఆడియెన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో వరుణ్ తేజ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్, కెమెరా: ఐనాంక బోస్.