Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ముకుందా', 'ఒక లైలా కోసం' సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ తెలుగు ఆడియెన్స్ని ఆకట్టుకున్న పూజా హెగ్డే బాలీవుడ్లోకి అడుగుపెట్టి నిరాశ చెందింది. అక్కడ హృతిక్ రోషన్తో కలిసి 'మొహెంజోదారో' చిత్రంలో నటించగా, అది పరాజయం చెందింది. దీంతో దాదాపు రెండేండ్ల తర్వాత మళ్ళీ తెలుగులోకి కమ్ బ్యాక్ అయి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. గతేడాది ఎన్టీఆర్తో 'అరవింద సమేత'లో మెప్పించింది. ఇటీవల మహేష్తో కలిసి 'మహర్షి'లో ఆకట్టుకుంది. ప్రస్తుతం బన్నీతో కలిసి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. గతంలో బన్నీతో 'డీజే'లో నటించిన విషయం విదితమే. దీంతోపాటు ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్లో రూపొందే సినిమాలో పూజానే హీరోయిన్గా నటిస్తుంది. 'ముకుందా' తర్వాత వరుణ్తేజ్ సరసన 'వాల్మీకి'లో హీరోయిన్గా ఎంపికైంది. అయితే 'వాల్మీకి'లో పూజా పాత్ర కొత్తగా ఉంటుందట. ఆమె పాత్రని హరీష్ చాలా స్పెషల్గా డిజైన్ చేశారట. 'ఈ సినిమాలో హరీష్ శంకర్ టీమ్తో పనిచేయడం థ్రిల్లింగ్గా ఉంది. ఇక అల్లు అర్జున్ సినిమా క్రేజీ ఫన్ రైడర్గా సాగుతుంది' అని పూజా హెగ్డే తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకుంటోంది. వీటితోపాటు ఆమె బాలీవుడ్లో 'హౌస్ఫుల్ 4'లో నటిస్తుంది. ఇలా వరుసగా పలు భారీ సినిమాల్లో భాగమైన పూజా బ్యాక్ టూ బ్యాక్ సందడి చేయడం ఖాయమంటున్నారు.