Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచి కథా బలమున్న సినిమాలో హైలైట్గా నిలిచే ప్రత్యేక సాంగ్లో మెరిసేందుకు అగ్ర కథానాయికలు వెనుకాడటం లేదు. తమన్నా ఇప్పటికే స్పెషల్ సాంగ్స్కి కేరాఫ్గా నిలిచింది. కాజల్ సైతం ఎన్టీఆర్తో 'జనతా గ్యారేజ్'లో 'నేను పక్కా లోకల్..' అంటూ మెస్మరైజ్ చేసింది. తాజాగా ఆమె మరోసారి ప్రత్యేక పాటలో మెరవనున్నట్టు తెలుస్తుంది. ఈ సారి అల్లు అర్జున్తో స్టెప్పులేయబోతుందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటిస్తున్నారు.
ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న
ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాట కోసం కాజల్ని చిత్రబృందం సంప్రదించిందట.
దీనిపై కాజల్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బన్నీతో స్టెప్పులేయడమంటే పెద్ద సవాల్.
మరి కాజల్ ఒప్పుకుంటుందా? లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే బన్నీతో కలిసి
కాజల్ 'ఆర్య 2'లో నటించిన విషయం విదితమే. ఇదే సెట్ అయితే దాదాపు పదేండ్ల తర్వాత
బన్నీ, కాజల్ జోడీని ప్రత్యేక పాటలో తెరపై చూడొచ్చు. ఇటీవల 'సీత'తో అలరించిన కాజల్
ప్రస్తుతం 'రణరంగం', 'కోమలి', 'భారతీయుడు 2'లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.