Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, కీర్తిసురేష్, సమంత కీలక పాత్రధారులుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. త్వరలో తన ఫ్యాన్స్కి నాగార్జున సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ అంతా పూర్తయ్యింది. త్వరలోనే ఈ షెడ్యూల్ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన నాగార్జున స్టయిలిష్ లుక్తోపాటు రకుల్ ప్రీత్ సింగ్తో, కీర్తిసురేష్తో కలిసి నాగార్జున ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ నెల 13న ఈ చిత్ర టీజర్ని విడుదల చేయబోతున్నాం. 'మన్మథుడు' స్ఫూర్తితో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈసి నిమాని ఫన్ రైడర్గా తెరకెక్కిస్తున్నారు' అని చెప్పింది. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: ఎం.సుకుమార్.