Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. సాజిద్ నడియడ్వాలా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన ఈ సినిమా సుమారు రూ.400కోట్లు వసూలు చేసింది. ఇది తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన 'కిక్'కి రీమేక్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందంటూ చాలా రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ కన్ఫమ్ చేసింది. ఎన్జీఈ (నడియడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్) ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సాజిద్ నడియడ్ వాలా దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలిపింది. మరి ఇందులో సల్మాన్ సరసన కథానాయికగా ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే సల్మాన్ ప్రస్తుతం 'దబాంగ్ 3'లో నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో ప్రస్తుతం 'మున్నా బద్నామ్ హువా' అంటూ సాగే ప్రత్యేక పాటని ముంబయిలో చిత్రీకరిస్తున్నారు. కొరియోగ్రాఫర్ వైభవి మెర్చాంట్ ఈ పాటని కంపోజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇందులో యువ కథానాయిక మౌనీరారుతో కలిసి సల్మాన్ ఆడిపాడనున్నారట. ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. మరోవైపు సంజరులీలా భన్సాలీ దర్శకత్వంలో 'ఇన్షాల్లా' చిత్రంలో సల్మాన్ నటించనున్నారు. ఇందులో అలియాభట్ కథానాయికగా నటించనుంది.