Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయకుడు కళ్యాణ్ రామ్ ఇటీవల '118'తో మంచి విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఆయన హీరోగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 'గత మూడు దశాబ్దాలుగా సంగీత రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఆదిత్యమ్యూజిక్ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో నిర్మించబోతున్న తొలి చిత్రానికి కథానాయకుడిగా కళ్యాణ్రామ్ని ఎంపిక చేసుకుంది. ఆయన హీరోగా 'శతమానంభవతి' ఫేం వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ నిర్మించనుంది. ఇందులో కళ్యాణ్రామ్కి జోడీగా మెహరీన్ నటించనుంది. 'జెంటిల్మెన్', 'సమ్మోహనం' వంటి అభిరుచిగల హిట్ చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'గీత గోవిందం', 'మజిలీ' వంటి మ్యూజికల్ బ్లాక్బస్టర్స్ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రకథని దర్శకుడు వేగేశ్న సతీష్ సిద్ధం చేశారు. ఇప్పటివరకు సంగీత రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆదిత్య మ్యూజిక్ సినిమా నిర్మాణంలోనూ అదే ముద్ర వేసుకుంటుందనే నమ్మకంతో ఉంది' అని చిత్ర బృందం తెలిపింది.