Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపి మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం గ్రాండ్గా ప్రారంభమైంది. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, మరో దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచాన్ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ''జై సింహా' తర్వాత బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది. సినిమాని గ్రాండ్గా ఓపెన్ చేయటం హ్యాపీగా ఉంది. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. పరుచూరి మురళి సినిమాకి కథ అందిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తుండగా, రామ్ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు వెల్లడిస్తాం' అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, యాక్షన్: రామ్లక్ష్మణ్, డైలాగ్స్: రత్నం, కో ప్రొడ్యూసర్: సి.వి.రావు.