Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరు కుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం 'మిషన్ మంగళ్'. జగన్ శక్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షరుతోపాటు విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) 2014లో చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగల్యాన్) ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని కన్ఫమ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. అయితే ఈ మధ్య చిత్ర విడుదల తేదీని మార్చినట్టు వార్తలొచ్చాయి. తెలుగు, తమిళం, హిందీలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ప్రభాస్ 'సాహో' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ సినిమా కోసం 'మిషన్ మంగళ్' విడుదల తేదీలో మార్పు చేశారు. వారం రోజులు ముందుగానే ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ స్పష్టం చేశారు. గురువారం ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర అక్షరు కుమార్, ప్రభాస్ల మధ్య పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.