Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల సూర్యతో కలిసి 'ఎన్జీకే'లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కోలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ అందుకుంది. విజరు సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందట. విజరు ప్రస్తుతం అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా విజరు నటిస్తున్న 63 చిత్రం కావడం విశేషం. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్సిగల్ ఇచ్చారు. ఇందులో కథానాయికగా రకుల్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. దీని కోసమై ఇప్పటికే రకుల్తో కథా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. విజరు వంటి అగ్ర హీరో సరసన అంటే ఏ కథానాయిక అయినా సరే ఓకే చెప్పకుండా ఉండదు. రకుల్ కూడా అందుకు మినహాయింపు కాదని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. అంతేకాదు తనకు విజరుతో కలిసి నటించాలనుందని ఇప్పటికే పలుమార్లు రకుల్ తన మనసులోని మాట చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో త్వరలోనే రకుల్ కోరిక నెరవేరబోతోందని వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం శివ కార్తికేయన్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న రకుల్ తెలుగులో 'మన్మథుడు 2'లో నాగార్జునకి జోడీగా సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోబోతోంది. గురువారం విడుదలైన ఈ చిత్ర టీజర్కి మంచి స్పందన కూడా లభించింది. వీటితోపాటు హిందీలో 'మర్జావాన్'లోనూ నటిస్తోంది.