Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్కి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరిగే 10వ ఎడిషన్ భారతీయ చలన చిత్రోత్సవానికి (ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్) ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకున్నారు. ఆగస్ట్ 8 నుంచి 17 వరకు జరిగే వార్షిక భారతీయ చలన చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆస్ట్రేలియాకి చెందిన విక్టోరియా గరవ్నమెంట్ షారూఖ్కి ఆహ్వానం పంపింది. ఇందులో పాల్గొనేందుకు తాను కూడా అసక్తిగా ఉన్నట్టు షారూఖ్ కూడా చెప్పారు. 'ఈ ఏడాది ఈ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెస్టివల్ థీమ్ బాగుంది. నిజమైన ప్రపంచ మార్పుని కోరుకునే కథకుల సాహసపూరిత ఆలోచనలకు ఈ థీమ్ ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకంగా నాకు సంతోషాన్నిచ్చింది. మెల్బోర్న్తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.
'చక్ దే ఇండియా' చిత్రం అక్కడే చిత్రీకరించాం. మళ్లీ అక్కడికే
వెళ్తున్నా. ఈసారి ఇండియన్ సినిమా వేడుకల్లో పాల్గొంటున్నా' అని షారుఖ్ ఖాన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే, షారూఖ్ గతేడాది 'జీరో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆనంద్ ఎల్ రారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటించారు. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత షారూఖ్ మరే చిత్రాన్ని అంగీకరించలేదు. ప్రస్తుతం విజరు హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో గెస్ట్ రోల్లో మెరవనున్నట్టు తెలుస్తోంది.