Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్జున్, విజరు ఆంటోని ప్రధాన పాత్రధారులుగా ఆషిమా నెర్వాల్ కథానాయికగా ఆండ్రూ లూయిస్ తమిళంలో 'కొలైగారన్' పేరుతో రూపొందించిన చిత్రాన్ని తెలుగులో 'కిల్లర్'గా విడుదల చేశారు. పారిజాత మూవీ క్రియేషన్స్పై టి.నరేష్కుమార్, టి.శ్రీధర్ సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేశారు. ఇటీవల విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో శుక్రవారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో అర్జున్ మాట్లాడుతూ, 'ప్రస్తుత కాలంలో ఓ సినిమా హిట్ కావడం అరుదైపోయింది. మా సినిమా అన్ని చోట్ల బాగా ఆడుతోంది. ఈ సందర్భంగా నన్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కోడి రామకృష్ణకి కృతజ్ఞతలు. 35 ఏళ్ళుగా నా సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు ఆండ్రూకు సక్సెస్ క్రెడిట్ ఇవ్వాలి. సినిమా చూసి అందరు పాజిటివ్గా మాట్లాడారు. ఈ సినిమా చేయటానికి కారణం విజరు ఆంటోనినే. ఈ సినిమాది రియల్ సక్సెస్. డబ్బుతో పాటు ప్రశంసలు రావడం గర్వంగా ఉంది. రెండో వారంలో 60 థియేటర్స్ పెరగడం చిత్ర ఘన విజయానికి సాంకేతం' అని అన్నారు.
'అర్జున్గారు నటించడం సినిమాకి ప్రధాన బలం. ఆయన్ని చూసి వ్యక్తిగతంగా, నటుడుగా ఎంతో నేర్చుకున్నా. మంచి సినిమాకి తెలుగు వారి ఆదరణ ఉంటుందని ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఆషిమా ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సాధించింది. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి రీచ్ అవుతాడు. ఇలానే మరిన్ని మంచి సినిమాలు అందించేందుకు ప్రయత్నిస్తాం' అని విజరు ఆంటోని తెలిపారు.
దర్శకుడు ఆండ్రూ మాట్లాడుతూ, 'టీమ్ సమిష్టి కృషి వల్లే సినిమా సక్సెస్ సాధించింది' అని చెప్పారు. హీరోయిన్ ఆషిమా చెబుతూ, ''కిల్లర్' లాంటి విజయవంతమైన సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. రివ్యూస్లో సినిమాతోపాటు, నా పాత్రకు, నటనకి కూడా ప్రశంసలు లభించాయి. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం సక్సెస్ రూపంలో రావటం సంతోషంగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాషశ్రీ, క్రాంతి, సైమన్ కింగ్, అంజయ్య, ప్రదీప్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా యూనిట్ కేక్ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది.