Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమీర్ఖాన్, శైలజ, శ్రద్ధా శర్మ, అక్షిత, అషి హీరోహీరోయిన్లుగా షేర్ దర్శకత్వంలో చంద్రశేఖర మూవీస్ పతాకంపై కె.వెంకట్రామ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'కెస్ 100'. శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అతిథిగా విచ్చేసిన నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ, 'వంద రోజులు ఆడించాలని దర్శక, నిర్మాతలు ఈ సినిమా తీసినట్టనిపిస్తుంది. నవనీత్ సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది' అని అన్నారు. 'ఆద్యంతం హర్రర్గా సాగే చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. చిన్నపిల్లలు చూడకూడదు. 'కెఎస్' అంటే తప్పుగా అనుకుంటున్నారు. కానీ కుమార్, స్వామి అనే ఇద్దరు స్నేహితుల మధ్య సాగే కథ ఇది. వ్యాపార కోణంలోనే లిప్లాక్స్ పెట్టాం. సినిమాని చూస్తే అమ్మాయిల్లో ధైర్యం వస్తుంది' అని దర్శకుడు షేర్ చెప్పారు.
హీరో సమీర్ చెబుతూ, 'సినిమాకి నా బెస్ట్ ఇచ్చాను. గర్వపడేలా చేశానని అనుకుంటున్నా' అని చెప్పారు. 'సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని ఏరియాల్లో బిజినెస్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 థియేటర్లలో సినిమాని జులై 5న రిలీజ్ చేయనున్నాం' అని నిర్మాత వెంకట్రామ్ రెడ్డి తెలిపారు.