Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు రాజా, రాశి సింగ్ జంటగా సుశీల సుబ్రమణ్యం దర్శకత్వంలో మహాలక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జెమ్'. ఈ నయా చిత్ర ప్రారంభోత్సవం శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ నివ్వగా, గంగుల ప్రతాప్రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించి, స్క్రిప్ట్ని చిత్ర దర్శకుడు సుబ్రమణ్యంకి అందజేశారు.
ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ, 'ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలకు నా కృతజ్ఞతలు. దర్శకుడు సుబ్రమణ్యం మంచి కథ రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాలోని ఒక పాటను కృష్ణవంశీ చిత్రీకరిస్తున్నారు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. హీరో విజయరాజా మాట్లాడుతూ: 'పూర్తి స్థాయి యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. జులై రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళనున్నాం. తప్పకుండా అందరినీ మెచ్చుకునే సినిమాగా రూపొందుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. 'ఈ సినిమాలో నేను ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నా. విజరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ప్రేమకథకు మంచి స్కోప్ ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా' అని హీరోయిన్ తెలిపింది. చిత్ర దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ, 'ఏడాదిన్నరగా ఈ స్టోరీపై వర్క్ చేశా. విజరు ఈ కథకి యాక్షన్ హీరోగా పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాడు. మొదటి షెడ్యూల్ని హైదరాబాద్లోనే చిత్రీకరించనున్నాం. అన్ని వర్గాలని అలరించేలా ఉంటుంది' అని చెప్పారు. 'ఈ కథ నన్ను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు సుబ్రమణ్యం ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తాడనే విశ్వాసం ఉంది. విజయ రాజా ఈ సినిమాతో యూత్కి దగ్గరవుతాడని నమ్ముతున్నా'
అని నిర్మాత పత్తికొండ కుమార స్వామి చెప్పారు.