Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమలాపాల్ కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ పాత్రలతోపాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ కెరీర్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలపైనే పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు భాషా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో', 'జెండా పై కపిరాజు' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అమలాపాల్ మెప్పించిన విషయం విదితమే. తాజాగా ఆమె తొలిసారి విజరు సేతుపతి సరసన నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది.
హీరోగా, విలన్గా రాణిస్తున్న విజరు సేతుపతి ప్రస్తుతం నూతన దర్శకుడు వెంకట్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇది శుక్రవారం ప్రారంభమైంది. క్రిస్మస్, నూతన సంవత్సరం, ఇతర ముఖ్యమైన వేడుకలు, ప్రేమ, సంగీతం వంటి అంశాలతోపాటు ఓ అంతర్జాతీయ అంశం ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. విజరు సేతుపతి మ్యూజిషియన్గా కనిపించే ఈ చిత్రంలో అమలాపాల్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందట. ప్రస్తుతం తమిళంలో 'ఆదో ఆంధా పారవై పోలా', 'ఆడాయి', 'ఆడుజీవితం', 'పారన్ను పారన్ను', 'కడవర్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.